హాకీ ప్లేయర్ గా మారిపోయిన‌ లావణ్య త్రిపాఠి.. ఏమైంది ఈమెకు..?

-

లావణ్య త్రిపాఠి..అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయ్యారు. ఆ తర్వాత..ఆమె పలు సినిమాల్లో నటించిన భలే భలే మగాడివోయ్..మంచి గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో నాగార్జున స‌ర‌స‌న న‌టించి మంచి మార్కులే సంపాదించుకుంది. అందంతో పాటు అభినయానికి ఆస్కారమున్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు ఉంటే దర్శక నిర్మాతలు లావణ్య వైపు మొగ్గుచూపుతున్నారు. దాంతో వైవిధ్యమైన పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నారు. ఒకటి… ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. రెండు… ‘చావు కబురు చల్లగా…!’. సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ హాకీ నేపథ్యంలో రూపొందుతోంది.

అందులో లావణ్య త్రిపాఠి హాకీ క్రీడాకారిణిగా కనిపించనున్నారు. క్యారెక్టర్‌లో పర్‌ఫెక్షన్ కోసం హాకీ కోర్టులో ఆమె తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా చిత్రయూనిట్ తెలుపుతుంది. అయితే విష‌యం ఏంటంటే.. ఇతర సినిమా ల షూటింగ్ లో బిజీ గా ఉన్నప్పటికీ లావణ్య త్రిపాఠి హాకీ కౌచింగ్ కి మాత్రం వెళ్లడం మానట్లేదట. అంతేకాకుండా లావణ్య ఎక్కువ సేపు హాకీ కోర్ట్ లో ఉంటున్నట్లు తెలుస్తుంది. మ‌రియు నిద్ర అయినా మానుకుంటుందట కానీ, హాకీ ప్రాక్టీస్ మాత్రం మానడం లేదట. ప్ర‌స్తుతం తెలుగు సినిమాలతో పాటు లావణ్య త్రిపాఠి ఒక తమిళ సినిమా కూడా చేస్తున్నారు. రోజంతా చెన్నైలో తమిళ సినిమా షూటింగ్ చేసి, నైట్ ఫ్లయిట్ క్యాచ్ చేసి హైదరాబాద్ వస్తున్నారట. ఎర్లీ మార్నింగ్ హాకీ ప్రాక్టీస్ చేసి, మళ్లీ చెన్నై వెళ్లి తమిళ సినిమా షూటింగ్ చేసింద‌ట‌ లావణ్య. దీంతో కొంద‌రు ఏమైంది ఈమెకు అంటుంటే.. మ‌రికొంద‌రు లావణ్య హార్డ్ వర్క్, డెడికేషన్‌కు ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news