‘లియో’ నుంచి త్రిష పోస్టర్‌ రిలీజ్‌

-

ఈ దసరాకు దడ పుట్టించేందుకు వస్తోంది దళపతి విజయ్ సినిమా లియో. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా పోస్టర్లు, టీజర్లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్​కు తీసుకువెళ్లాయి. లోకేశ్ కనగరాజన్ దర్శకత్వంలో ఈ చిత్రం వస్తుండటంతో మరింత అంచనాలు పెరిగాయి. ఇక వరుస అప్డేట్లు ఇస్తూ ప్రేక్షకులకు సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది చిత్రబృందం. ఇందులో భాగంగానే ఇవాళ ఈ సినిమాలో హీరోయిన్​గా నటిస్తున్న త్రిష పోస్టర్​ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్​లో త్రిష రక్త పాతం చూస్తూ భయంతో షాక్‌ అయినట్లు కనిపిస్తోంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత త్రిష- విజయ్ కలిసి ఈ సినిమాలో నటించబోతున్నారు. దీంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి కలుగుతోంది.

ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్​లో రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో విజయ్-త్రిషలకు మంచి మార్కెట్ ఉన్నందున టాలీవుడ్​లో ప్రమోషన్స్ అదిరిపోయేలా చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. ఈ మధ్య ఇతర భాషల సినిమాలు ఊహించని రేంజ్​లో కలెక్షన్లు కురిపిస్తున్నందున లియో టీమ్ కూడా తెలుగు మార్కెట్​పై స్పెషల్ ఫోకస్ పెట్టనుందట.

Read more RELATED
Recommended to you

Latest news