‘ఆదిపురుష్‌’ టీమ్​కు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం విషెస్

-

మరికొన్ని గంటల్లో రెబల్ స్టార్ ప్రభాస్ రాఘవరాముడిగా వెండితెరపై వెలుగులు పంచబోతున్నాడు. సినీప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఆదిపురుష్‌’ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులంతా చిత్రబృందానికి ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెబుతున్నారు. తాజాగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ‘ఆదిపురుష్‌’పై ట్వీట్‌ చేశారు.

‘‘మర్యాద పురుషోత్తముడు రాముని జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం అంతా ఎదురుచూస్తున్నారు. అందరిపై ఆయన దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను. ‘ఆదిపురుష్‌’ మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ దర్శక నిర్మాతలకు ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పారు.

దేశవ్యాప్తంగా ఇప్పటికే ‘ఆదిపురుష్‌’ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ మొదలైన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌ బుకింగ్‌ పోర్టల్‌ వేదికగా సినీ ప్రియులు టికెట్లు బుక్‌ చేసుకుంటున్నారు. అత్యంత భారీ బడ్జెత్‌తో రూపొందిన ‘ఆదిపురుష్‌’ రేపు (జూన్‌ 16) విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాఘవ రాముడి పాత్రలో నటిస్తుండగా.. కృతి సనన్ సీతగా నటిస్తోంది. ఇక సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news