మహేష్ 26 మూవీ.. ఇంట్రెస్టింగ్ న్యూస్

-

సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సినిమా తర్వాత 25వ సినిమాగా మహర్షి మూవీ చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 2019 ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ 26వ సినిమా సుకుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ మూవీ అని తెలుస్తుంది. సుకుమార్ తో మహేష్ ఇదవరకు 1 నేనొక్కడినే సినిమా చేశాడు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. మరోసారి క్రేజీ కాంబినేషన్ షురూ కాబోతుంది. మరి హిస్టారికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమాపై వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news