’ఎఫ్ 2′ సీక్వెల్‌లో మహేష్ బాబు.. డేట్లు కూడా ఇచ్చేశార‌ట‌..?

-

గ‌త ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన నాలుగు చిత్రాల్లో ‘ఎఫ్ 2’ సినిమా సత్తా చాటింది. భారీ వసూళ్లతో కాసుల వర్షం కురిపించింది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో.. ‘ఎఫ్ 3’ సీక్వెల్‌ తీయబోతున్నట్టు ప్రకటించాడు. అది కూడా దిల్ రాజు బ్యానర్ లోనే ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేశాడు. అంతేకాదు ఈ సీక్వెల్ కోసం ముందుగా మాస్‌రాజా రవితేజను అనుకున్నారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఎఫ్ 3 సీక్వెల్‌లో మహేష్ బాబు యాక్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ యేడాది సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మహేష్ బాబుకు మంచి హిట్ అందించాడు.

దీంతో అనిల్ రావిపూడితో మరో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు. ఇక ఈ సినిమాతో మహేష్ బాబుతో అనిల్ రావిపూడికి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ అనుబంధం రీత్యా ఎఫ్ 3 సీక్వెల్‌లో యాక్ట్ చేస్తే బాగుంటుందని సూచించాడట. దీంతో మ‌హేష్ బాబు గ్రీన్ సిగ్నెల్ ఇవ్వ‌డ‌మే కాకుండా 13రోజుల కాల్షీట్ కూడా ఇచ్చేశారట. ఇప్ప‌టికే ఎఫ్2 చిత్రం తో వరుణ్, వెంకటేష్ లకి మంచి పేరు దక్కింది. ఇపుడు ఈ హీరోలతో మహేష్ నటించడం టాలీవుడ్ లో ఆస‌క్తిక‌రంగా మారింది. అంతేకాకుండా, వెంకీ, వరుణ్ సరసన హీరోయిన్లుగా తమన్నా, మెహ్రీన్ కంటిన్యూ అవ్వనుండగా.. మహేష్ సరసన రష్మిక కనిపించబోతున్నట్లు టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news