మహేష్ కెరీర్ మార్చేసిన ‘పోకిరి@14’ ఏళ్ళు…!

-

మహేష్ బాబు కెరీర్ లో సంచలన చిత్రం పోకిరి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పుడు యూత్ ని ఒక ఊపు ఊపేసింది. టాలీవుడ్ లో ఈ సినిమా ఎన్నో రికార్డులను కూడా బద్దలు కొట్టింది. సినిమాలో మహేష్ నటన, పూరి దర్శకత్వం… అన్నీ కూడా హైలెట్ గా నిలిచాయి. ప్రతీ సీన్ కూడా సినిమాలో ఒక సంచలనం. సినిమా చివరి వరకు కూడా ఎక్కడా కూడా బోర్ కొట్టించే విధంగా ఉండదు.

ముఖ్యంగా మహేష్ నోటి నుంచి వచ్చిన కొన్ని డైలాగులు ఎంత గానో ఆకట్టుకున్నాయి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు అంటూ మహేష్ నోటి నుంచి వచ్చిన డైలాగ్ ఇప్పటికి సంచలనమే. ఈ సినిమా ద్వారా మహేష్ యూత్ కి బాగా దగ్గరయ్యాడు. ఇలియానా కూడా హీరోయిన్ గా బాగా ఆకట్టుకుంది. బ్రహ్మానందం కామెడి కూడా సినిమాలో హైలెట్ గా నిలిచింది.

సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కొన్ని ఫైట్స్ యూత్ కి బాగా దగ్గరయ్యాయి. ఈ సినిమాతో ఒక్కసారిగా మహేష్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసాడు మహేష్. కాని పూరి మాత్రం కరీర్ లో బాగా ఇబ్బందులు పడ్డాడు. ఆయన సినిమాలు అక్కడి నుంచి ఫ్లాప్ అయ్యాయి. అప్పటి నుంచి టెంపర్ మినహా ఒక్కటి అంటే ఒక్కటి కూడా సరైన హిట్ కొట్టలేదు పూరి. ఈ సినిమా వచ్చి నేటికి 14 ఏళ్ళు పూర్తి అయింది..

Read more RELATED
Recommended to you

Latest news