వ్యాపారం మీద మహేష్ ఫోకస్… కొత్త ప్రయోగం ఇదే…!

-

టాలీవుడ్ హీరోలు ఇప్పుడు వ్యాపారం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. వరుసగా సినిమాలు చేయడమే కాదు… వాళ్ళు వ్యాపారంలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ భారీగా పెట్టుబడులు పెట్టాలి అని భావిస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, నానీ సహా కొందరు హీరోలు వ్యాపారం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. వాళ్లకు ప్రమోషన్ చేయడం పెద్ద కష్టం కాదు. దీనితో ఇప్పుడు ఎక్కువగా వ్యాపారం మీద దృష్టి పెట్టి పెట్టుబడులు పెడుతున్నారు.

మహేష్ బాబు విషయానికి వస్తే ఆయన వరుసగా సినిమాలను నిర్మిస్తున్నారు. తన సినిమాలలో తాను పెట్టుబడులు పెడుతున్నారు. మ‌హేశ్ ఇప్ప‌టికే మ‌ల్టీపెక్స్ థియేట‌ర్స్‌, టెక్స్‌టైల్స్ బిజినెస్‌ల‌తో పాటు జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సినిమా నిర్మాణ రంగంలో బిజీ గా ఉన్నారు. ఇప్పుడు మరో ప్రయత్నం చేస్తున్నాడు మహేష్. మరో నిర్మాణ సంస్థతో కలిసి ఒక కొత్త ప్రయోగానికి సిద్దమయ్యాడు.

ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌తో క‌లిసి మ‌హేశ్ ఓటీటీ రంగంలోకి అడుగు పెట్టే సూచనలు ఉన్నాయని అంటున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా తాను పెట్టుబడులు పెడుతున్నాడు. ఇక అనీల్ రావిపూడితో తర్వాతి సినిమా చేసే అవకాశాలు ఉన్నా… త్రివిక్రమ్ ఓకే అనడం తో ఇప్పుడు ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్ బాబు.

Read more RELATED
Recommended to you

Latest news