మహేష్ నిర్మాతలను చిరాకు పెడుతున్నాడా…?

-

టాలీవుడ్ లో మహేష్ బాబుకి ఉండే క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. మహేష్ బాబుతో సినిమా చేయడానికి ఎందరో నిర్మాతలు పోటీ పడుతూ ఉంటారు. టాలీవుడ్ లో మహేష్ బాబుతో సినిమా చేయడానికి భారీ బడ్జెట్ తో రెడీ అవుతూ ఉంటారు నిర్మాతలు. అలాంటి నిర్మాతలు ఇప్పుడు మహేష్ బాబు చిరాకు పెడుతున్నాడు. ఈ మధ్య కాలంలో మహేష్ బాబుకి కమర్షియల్ పిచ్చి అనేది క్రమంగా పెరుగుతుంది.

దీనితో మహేష్ తో సినిమా చెయ్యాలి అనుకునే నిర్మాతలు దర్శకులు ఇప్పుడు ఆగ్రహంగా ఉన్నారు. తాను చేసే సినిమాలో తాను పెట్టుబడి పెడతాను అంటూ చికాకు పెడుతున్నాడు. మహర్షి, భరత్ అను నేను సినిమాలకు అతను నిర్మాతగా ఉన్నాడు. ఈ సినిమాలకు వచ్చే ముందస్తు మార్కెట్ మొత్తం తీసుకుంటున్నాడు. దాదాపు 60 నుంచి 70 కోట్ల వరకు మార్కెట్ జరుగుతుంది. ఈ మార్కెట్ మొత్తం మహేష్ తీసుకుంటున్నాడు.

దీనితో నిర్మాతలు భారీగా నష్టపోయారు. వసూళ్లలో అతను నిర్మాతగా ఉండటం తో షేర్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఇలాగే ఉంటే అతని తో సినిమా చేయడం కష్టమని వెనక్కు తగ్గుతున్నారు నిర్మాతలు. సినిమా వసూళ్లలో షేర్ తీసుకుని రెమ్యునరేషన్ కింద ముందస్తు మార్కెట్ మొత్తం తీసుకుని సినిమా చేస్తే తాము గడ్డి తినాలని నిర్మాతలు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చుకోకపోతే కష్టమని వాపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news