BREAKING : సీఎం జగన్‌ తో మంచు విష్ణు కీలక సమావేశం

-

అమరావతి : ఇవాళ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డితో మా అసోషియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు భేటీ కానున్నారు. మరి కాసేపట్లో సీఎం జగన్ ను ఆయన నివాసంలో సమావేశం కానున్నారు మంచు విష్ణు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్‌ రెడ్డితో లంచ్ మీటింగ్ చేయనున్నారు మంచు విష్ణు.

మా అధ్యక్షుడు అయిన తర్వాత తొలి సారి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని కలుస్తున్నారు మంచు విష్ణు. సినిమా టికెట్ల విషయంలో చిరంజీవి బృందం రాక సందర్భంగా అటు టాలీవుడ్‌, ఇటు ఏపీ రాజకీయాల్లో విమర్శలు రేగాయి. తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని కినుకు వహించింది మంచు వర్గం… ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డితో మంచు విష్ణు భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

ఇక వీరిద్దరి సమావేశంలో ఎలాంటి విషయాలపై చర్చ జరుగుతుందోనని అందరూ చర్చించుకుంటున్నారు. సినిమా టికెట్ల వివాదం, మా అసోషియేషన్‌ ఎన్నికల విషయాలపై ఈ సందర్భంగా చర్చ జరిగే ఛాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version