మణిరత్నం మెగా మల్టీస్టారర్

-

సౌత్ ఇండియన్ క్రేజీ డైరక్టర్స్ లో ఒకరైన మణిరత్నం నవాబ్ సినిమాతో అదరగొట్టగా ఇప్పుడు మరోసారి భారీ మల్టీస్టారర్ కు సిద్ధమవుతున్నాడు. తెలుగులో ట్రిపుల్ ఆర్ సినిమాను తలదన్నేలా ఈ మల్టీస్టారర్ ఉందని చెప్పొచ్చు. కోలీవుడ్ స్టార్ హీరోస్ విజయ్, విక్రం, శింభులతో ఓ మెగా మల్టీస్టారర్ నే ప్లాన్ చేశాడట మణిరత్నం. ఈ సినిమా కథ పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని అంటున్నారు.

విజయ్, విక్రం ఇద్దరు స్టార్స్ ను మణిరత్నం ఒప్పించాడు అంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఓ పక్క రాజమౌళి ఎన్.టి.ఆర్, చరణ్ లతో ఆర్.ఆర్.ఆర్ ఎనౌన్స్ చేయగా ఆ సినిమాకు పోటీగా కోలీవుడ్ లో ఈ మెగా మల్టీస్టారర్ తెరకెక్కుతుందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news