మన్మధుడు-2లో సమంత

-

కింగ్ నాగార్జున సూపర్ హిట్ మూవీ మన్మధుడు సీక్వల్ ప్లానింగ్ లో ఉందన్న విషయం తెలిసిందే. చిలసౌ సినిమాతో ప్రతిభ చాటుకున్న రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. అన్నపూర్ణ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, అనుష్క హీరోయిన్స్ గా నటిస్తారని తెలుస్తుంది. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాలో అక్కినేని కోడలు సమంత కూడా నటిస్తుందని సమాచారం.

2002లో విజయ భాస్కర్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా నాగార్జున కెరియర్ లో అదిరిపోయే హిట్ అందుకుంది. ఇక ఈ సీక్వల్ కథ కూడా బాగా వచ్చిందట. సినిమాలో సమంత పాత్ర చిన్నదే అయినా సినిమాను మలుపు తిప్పేలా ఉంటుందని తెలుస్తుంది. మార్చి 15న సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సీక్వల్ ఆ సినిమా రేంజ్ ను పెంచుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news