లియో నటుడు మన్సూర్‌ అలీఖాన్‌కు అస్వస్థత

-

తమిళనాడులోని వేలూర్‌ నియోజక వర్గ స్వతంత్ర అభ్యర్థి, నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రోజున ప్రచారానికి చివరి రోజు కావడంతో ముమ్మరంగా ఓట్లు అభ్యర్థించారు. ఆ సమయంలో అకస్మాత్తుగా అస్వస్థతతకు గురవ్వడంతో వెంటనే గుడియాత్తంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చికిత్స తర్వాత గుడియాత్తం నుంచి చెన్నై కేకేనగర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన  ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే తనకు పండ్ల రసంలో ఎవరో విషం కలిపి ఇచ్చారని మస్సూర్‌ అలీఖాన్‌ ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. గుడియాత్తం సంత నుంచి ఇంటికి బయలు దేరుతున్నప్పుడు దారిలో కొందరు పండ్ల రసం, మజ్జిగ ఇచ్చారని మన్సూర్ తన ప్రకటనలే పేర్కొన్నారు. ఆ జూస్ తాగిన కొద్ది నిమిషాలకే కళ్లు తిరిగి గుండెల్లో నొప్పి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని పేర్కొన్నారు. తన అభిమానులెవరూ ఆందోళన చెందవద్దని ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news