ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగా సంబరం…

-

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ఉప్పెన చిత్రం ఫిబ్రవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులని విశేషంగా ఆకర్షించింది. దేవిశ్రీ అందించిన పాటలు జనాల్లోకి వెళ్ళిపోయాయి. ఎప్పుడెప్పుడు తెర మీద సినిమా చూద్దామా అని ఆసక్తిగా ఉన్నారు సినిమా ప్రేక్షకులు. మరో వారంలో విడుదల కాబోతున్న ఉప్పెన చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం జరగనుంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు.

తన మేనల్లుడి మొదటి చిత్రం రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆశీర్వదించేందుకు మెగాస్టార్ వచ్చేస్తున్నారు. విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రంలో క్రితిశెట్టి హీరోయిన్ గా కనిపిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. ప్రేమికుల రోజు కానుకగా విడుదల అవబోతున్న ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news