రామ్‌చరణ్‌తో సెల్ఫీ.. కల నెరవేరిందన్న మెల్‌బోర్న్‌ మేయర్‌

-

టాలీవుడ్‌ స్టార్‌ హీరో రామ్‌ చరణ్‌ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఇటీవల సందడి చేశారు. ‘ది ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్ ఆఫ్‌ మెల్‌బోర్న్‌’కు గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఆస్ట్రేలియాలో మన జాతీయ జెండాను ఎగురవేశారు. అక్కడ షూటింగ్‌ చేసిన ‘ఆరెంజ్‌’ రోజులను ఎప్పటికీ మర్చిపోలేనని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగారు. తాజాగా దీనిపై మెల్‌బోర్న్‌ మేయర్‌ నిక్‌ రీస్‌ పోస్ట్‌ పెట్టారు.

‘ఈ నగరాన్ని గొప్పగా మార్చడంలో ఇక్కడ నివసిస్తున్న భారతీయులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. డిప్యూటీ మేయర్‌ అభ్యర్థి రోషెనాతో కలిసి నేను తాజాగా జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వెళ్లాను. అక్కడ గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌తో కలిసి సెల్ఫీ దిగాను. దీంతో నాకున్న విష్ లిస్టులో ఒక కోరిక తీరింది.’ అంటూ చరణ్‌పై తనకున్న అభిమానాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు నిక్ రీస్. మరోవైపు ‘అక్టోబర్‌లో డిప్యూటీ మేయర్‌గా రోషెనా ఎన్నికైతే ఆమె చరిత్ర సృస్టిస్తారు. 182 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ స్థానాన్ని పొందిన భారతీయ వారసత్వపు మొదటి వ్యక్తి ఆమె అవుతారు.’ అని నిక్‌ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు నిక్.

Read more RELATED
Recommended to you

Latest news