‘అతణ్ని ఉరి తీయండి’.. కోల్‌కతా హత్యాచార నిందితుడి అత్త

-

కోల్‌కతాలో వైద్యురాలి హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనలో నిందితుడైన సంజయ్‌ రాయ్‌ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో నిందితుడి జీవితంలోని మరో కోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. అతడికి, భార్యకు మధ్య సత్సంబంధాలు లేవని స్వయంగా అత్త దుర్గాదేవి తెలిపారు. కొంత కాలం క్రితం అతడు భార్యపై చేయి చేసుకోవడంతో ఆమెకు గర్భస్రావమైందని.. అతడిని ఉరితీసినా ఫర్వాలేదని ఆమె వ్యాఖ్యానించారు.

అతడు చేసిన నేరం గురించి మాత్రం నేను మాట్లాడలేను. అంతటి నేరానికి పాల్పడే శక్తి అతడికి ఒక్కడికే లేదు. మరికొంత మంది ఉండి ఉండొచ్చు. నా కూతురితో అతడికి పెళ్లయి రెండేళ్లు అవుతోంది. నా కూతురు రెండో భార్య. పెళ్లయిన మొదట్లో ఆరు నెలలు బాగానే ఉన్నారు. నా కుమార్తె ప్రెగ్నెంట్ అవ్వగానే గొడవలు మొదలయ్యాయి. మూడు నెలల గర్భంతో ఉన్నప్పుడు నా కూతురిపై చేయి చేసుకోవడంతో ఆమెకు అబార్షన్ అయింది. పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టాం.’’ అని దుర్గాదేవి మీడియాకు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news