ఆదిపురుష్ సినిమా చూసిన హనుమంతుడు…వీడియో వైరల్

-

ఆదిపురుష్ సినిమా ప్రదర్శించే థియేటర్లలో హనుమంతుడి కోసం ఒక సీటును కేటాయిస్తున్న విషయం తెలిసిందే. హనుమంతుడు వచ్చి సినిమా చూస్తాడు అనే నమ్మకంతో ఇలా ఒక సీటు విక్రయించకుండా వదిలేయాలని నిర్ణయించారు. అయితే ఈ సినిమా ప్రదర్శిస్తున్న ఓ థియేటర్లోకి ఓ వానరం వచ్చింది. కాసేపు స్క్రీన్ వైపు చూసి వెళ్ళిపోయింది.

దీంతో హనుమంతుడు వచ్చి సినిమా చూశాడంటూ ప్రేక్షకులు జైశ్రీరామ్ అని నినాదాలు చేశారు. కాగా, నేపాల్ లో ఆదిపురుష్ సినిమాపై వివాదం తలెత్తింది. సీత భారత్ లో జన్మించినట్లు చూపడంపై ఆ దేశ సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది. సీత నేపాల్ లో జన్మించారని, దీనిని సవరించకుంటే విడుదలకు అనుమతినివ్వమని స్పష్టం చేసింది. అటు ఈ డైలాగ్ తీసేయకుంటే భారత సినిమాలు నిలిపేస్తామని పలువురు నేపాల్ నేతలు మండిపడ్డారు. దీంతో డైలాగ్ తొలగించడంతో అక్కడ రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. కానీ మార్నింగ్ షోలు నిలిపివేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news