BREAKING : ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. 15 మంది దుర్మరణం

-

కెనడాలో ఇవాళ తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ంమానిటోబా ప్రావిన్స్​లోని గ్రామీణ ప్రాంతంలోని హైవే కూడలిలో 25 మంది ప్రయాణికులతో క్యాసినో వెళ్తున్న బస్సు.. ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.​ హెలికాప్టర్​ల ద్వారా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రమాదం జరిగిన బస్సులో ఉన్న వారంత వయో వృద్ధులని పోలీసులు తెలిపారు.

ఈ ప్రమాదంపై కెడనా ప్రధాని జస్టిన్ ట్రూడో విచారం వ్యక్తం చేశారు. ‘మానిటోబా ప్రమాదం చాలా విషాదకరమైనది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. తమ ప్రియమైన వారిని పోగొట్టుకున్న వారు అనుభవిస్తున్న బాధను ఊహించలేను. కానీ కెనడియన్లు వారి కోసం ఉన్నారు’ అని ట్రూడో అన్నారు. ఇటీవల కెనడాలో జరిగిన అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదాలలో ఇదొకటి అని ట్రూడో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news