సాక్షి శివానంద్ పై మ‌ర్డ‌ర్ కేసు? సొంత చెల్లినే సాక్షి శివానంద్ హత్య!

-

ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సాక్షిశివానంద్ గురించి ప‌రిచ‌యం అవ‌సరంలేదు. చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేష్, మ‌హేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాల్లో న‌టించిన శివానంద్ హ‌వా కొన్నాళ్ల పాటు సాగింది. ఆ త‌ర్వాతి కాలంలో పాత నీరు పోయే కొద్ది నీరు వ‌స్తుందన్న చందాన సాక్షి సినిమాల‌కు దూర‌మైంది. తాజాగా ఆమె ఓ సంచ‌ల‌న వార్త‌తో వెలుగులోకి వ‌చ్చింది. సాక్షిశివానంద్ తోడ‌పుట్టిన చెల్లినే హ‌త్య చేయాల‌నుకుందని సాక్షి చెల్లి శిల్పా ఆనంద్ ఆరోపించింది. సాక్షి భిమా డ‌బ్బుల కోసం త‌న అత్త‌తో క‌లిసి హ‌త్య చేయాల‌ని ప‌థ‌కం వేసిన‌ట్లు సంచ‌ల‌న ఆరోప‌ణ చేసింది. అంతే కాదు మ‌రో అడుగు ముందుకేసి సాక్షి, అత్త భావ‌న, డ‌బ్బు కోసం క‌ట్టుకున్న భ‌ర్త‌నే క‌డ తేర్చార‌ని శిల్పా ఆరోపించ‌డం అంత‌టా చ‌ర్చ‌కు దారి తీస్తోంది.

ఆ స‌మ‌యంలో శిల్ప పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు తెలిపింది. ఇప్పుడు భీమా డ‌బ్బు కోసం త‌న అత్త‌తో క‌లిసి త‌న‌ని మ‌ట్టుబెట్టి ఆ డ‌బ్బును చేజిక్కించుకోవాల‌ని ప‌థ‌కాలు వేస్తోంద‌ని ఆరోపించింది. భ‌ర్త‌ను చంపిన స‌మ‌యంలో భావ‌న వెంట‌నే ఆమెరికాకు వెళ్లిపోయింద‌ని,పోలీసులు ఆమెకోసం ఎంత వెతికినా క‌నిపించ‌క‌పోయేస‌రికి సైలెంట్ అయిపోయారాని తెలిపింది. అయితే స్టేష‌న్ లో కేసు న‌మోదైంది కాబ‌ట్టి భావ‌న ఇండియాకు తిరిగొస్తే క‌చ్చితంగా అరెస్ట్ అవుతుంద‌ని పేర్కొంది. దీంతో ఈ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియా అంత‌టా దావానాలా వ్యాపించాయి.

సాక్షిశివానంద్ గురించి సొంత చెల్లులు శిల్పా ఆనంద్ ఇలా ఆరోప‌ణ‌లు గుప్పించ‌డంతో టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ వ్యాఖ్య‌ల‌పై సాక్షి శివానంద్ ఇంకా స్పందించ‌లేదు. ఆమె రియాక్ష‌న్ బ‌ట్టి ఈ వ్యాఖ్య‌ల్లో నిజ‌మెంత‌? అన్న‌ది స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. సాక్షి శివానంద్ మంచు విష్ణు న‌టించిన `విష్ణు` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. త‌ర్వాత చాలా సినిమాల్లో న‌టించింది. క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ భాష‌ల్లోనూ న‌టించింది. తెలుగులో సాక్షి చివ‌రిసారిగా రంగ ది దొంగ అనే సినిమాలో న‌టించింది. త‌ర్వాత పూర్తిగా సినిమాల‌కు దూర‌మైంది.

Read more RELATED
Recommended to you

Latest news