‘కల్కి’ సీక్వెల్‌ సీక్రెట్ రివీల్ చేసిన నాగ్‌ అశ్విన్‌

-

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.700 కోట్ల కలెక్షన్లు దాటిన ఈ చిత్రం ఇంకా థియేటర్లలో హౌస్ఫుల్గా నడుస్తోంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ సీక్వెల్పై మాట్లాడారు. అసలు కథ మొదలయ్యేది పార్ట్‌-2లోనే అంటూ ఆసక్తికర విషయాన్ని ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు..

‘‘సీక్వెల్‌కు సంబంధించి నెలరోజుల షూటింగ్‌ చేశాం. దానిలో 20 శాతం బెస్ట్‌గా వచ్చింది. ఇంకా ముఖ్యమైన యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. వాటిని కొత్తగా ప్రారంభించాలి. ఈ సీక్వెల్‌లో కమల్‌ హాసన్‌, ప్రభాస్‌, అమితాబ్‌ మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలుంటాయి. అశ్వత్థామ, కర్ణుడు, యాస్కిన్‌ల మధ్య శక్తిమంతమైన ధనుస్సు కీలకం కానుంది. అంతే కాకుండా రానున్న సీక్వెల్స్లో దుల్కర్ సల్మాన్ పాత్ర కీలకంగా ఉంటుంది. ఇంకా కొత్త పాత్రలు వచ్చి చేరతాయి. చివరి వరకు కృష్ణుడిని రివీల్ చేసే ఉద్దేశం లేదు.’’ అని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news