గంద్వాల పంచాయితీ…రేవంత్ రెడ్డితో సరిత భేటీ

-

Gadwala ZP chairperson Sarita Tirupathaiah met CM Revanth Reddy: గద్వాల పంచాయితీ తారా స్థాయికి చేరింది. సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య. గద్వాల బిఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు లోకల్ నేతలు.

Gadwala ZP chairperson Sarita Tirupathaiah met CM Revanth Reddy

నిన్న గద్వాల లో సెల్ టవర్ ఎక్కడం, పెట్రోల్ పోసుకుంటామని హెచ్చరికలు చేశారు సరిత అనుచరులు. అటు జీవన్ రెడ్డి మరోసారి మనస్తాపానికి గురయ్యారు. జగిత్యాలలో ఆయన ఉన్న ప్లెక్సిని తొలగించటంపై తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని 8 వార్డులో బోనాల పండగ సందర్భంగా ప్లెక్సి ఏర్పాటు చేశారు. బోనాల పండగలో పాల్గొనేందుకు వెళ్లి వస్తుండగా ప్లెక్సిని మున్సిపల్‌ సిబ్బంది తొలగిస్తుండగా జీవన్‌రెడ్డి గమనించారు.  ప్లెక్సీని ఎవరు తీయమన్నారని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news