డైలమా లో కింగ్ నాగార్జున….??

-

టాలీవుడ్ మన్మధుడు కింగ్ అక్కినేని నాగార్జున కొద్ది రోజుల క్రితం స్టార్ మా ఛానల్లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 3 కి హోస్ట్ గా వ్యవహరించిన తెలిసిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ ఆయన నటించిన మన్మధుడు 2 మూవీ ఘోరమైన ఫ్లాప్ ని మూటగట్టుకుంది. 2002లో విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మన్మధుడు సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన మన్మధుడు 2 లో ఆకట్టుకునే కథ, కథనాలు లేకపోవడంతో ఈ సినిమా పై మెజారిటీ ప్రేక్షకులు పెదవి విరిచారు. ఇక ఆ సినిమా తర్వాత కొంత నెగటివ్ విమర్శలు కూడా నాగ్ పై వెల్లువెత్తాయి. అనంతరం కొంత డైలమాలో పడ్డ అక్కినేని నాగార్జున,

కొద్దిరోజుల నుండి వరుసగా పలువురు దర్శకుల నుంచి కథలు వింటూ వస్తున్నారు. అయితే కొన్నాళ్ల క్రితం గతంలో తనకు సోగ్గాడే చిన్నినాయన వంటి హిట్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఆ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కనున్న బంగార్రాజు అనే సినిమాలో నాగ్ నటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమా కథ విషయంలో నాగార్జున కొంత అసంతృప్తిగా ఉన్నారని, అందుకే దానిని పక్కన పెట్టినట్లు టాలీవుడ్ వర్గాల నుండి వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఆయన వద్దకు ముగ్గురు టాలీవుడ్ అగ్ర దర్శకులు వచ్చి కథలు వినిపించినట్లు సమాచారం. అలానే వాటిలో ఒక కథకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, అతి త్వరలో ఆ సినిమా ప్రారంభం అవుతుందని కూడా చెప్తున్నారు.

కాగా దీనిపై మరొక వాదన కూడా వినపడుతోంది అదేమిటంటే, నాగార్జున ఇతర దర్శకుల నుండి కథలు వింటున్న మాట వాస్తవమేనని, కానీ ముందుగా గతంలో అనుకున్న ప్రకారం బంగార్రాజు సినిమా మొదలెట్టి, ఆ తర్వాతనే వేరే సినిమాలోనటిస్తారని వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే నేడు పలు మీడియా మాధ్యమాల్లో విరివిగా ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో ఏది నిజమో తెలియాలంటే, ఆయన నుండి తన తదుపరి సినిమా విషయమై అధికారిక ప్రకటన వచ్చే వరకు మనం వేచి చూడాల్సిందే….!!

Read more RELATED
Recommended to you

Latest news