టాలీవుడ్లో విషాదం… అనారోగ్యంతో ప్రముఖ నటుడు మృతి(నర్సింగ్ యాదవ్)

-

ఈ ఏడాది చివరి రోజు కూడా టాలీవుడ్ లో విషాదం నెలకొంది. సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌ కొద్ది సేపటి క్రితం కన్ను మూశారు. ఆయన వయసు ప్రస్తుతం 52 సంవత్సరాలు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన రాత్రి తుది శ్వాస విడిచారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అనేక సినిమాల్లో నటించిన ఆయన కమెడియన్, అలానే విలన్‌ పాత్రల్లో నటించి మెప్పించారు. మైలా నర‌సింహ యాద‌వ్‌ అనబడే ఆయనను ఇండ‌స్ట్రీలో అంద‌రూ న‌ర్సింగ్‌ యాద‌వ్ అని పిలుస్తారు.

1963 మే 15న హైద‌రాబాద్‌లో జన్మించిన ఆయ‌న‌కు భార్య చిత్ర‌, కొడుకు రిత్విక్ యాద‌వ్‌ ఉన్నారు. విజ‌య‌నిర్మ‌ల ద‌ర్శక‌త్వం వ‌హించిన ;హేమాహేమీలు’తో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యారు నర్సింగ్ యాదవ్. ఆ తరువాత క్ష‌ణ‌క్ష‌ణం, గాయం, ముఠామేస్త్రీ, మాస్‌, శంక‌ర్ దాదా ఎంబీబీయ‌స్‌, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, రేసుగుర్రం, పిల్ల‌ జ‌మీందార్‌, కిక్‌ త‌దిత‌ర చిత్రాల్లో ఆయ‌న చేసిన కేర‌క్ట‌ర్ల‌కు చాలా మంచి పేరు వ‌చ్చింది. గ‌త కొంత‌కాలంగా నర్సింగ్ యాదవ్‌కు డయాలసిస్ జ‌రుగుతోంది. 

Read more RELATED
Recommended to you

Latest news