రాజ్‌తరుణ్‌కు నార్సింగి పోలీసుల నోటీసులు

-

టాలీవుడ్ యంగ్ నటుడు రాజ్​ తరుణ్ – లావణ్య వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో హాట్​ టాపిక్​గా మారిన ఈ కేసులో రోజుకో విషయం బయటపడుతోంది. అయితే ఇప్పటికే ఈ వ్యవహారంలో లావణ్య ఫిర్యాదుతో పోలీసులు రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా ఆమె సోదరుడిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ వ్యవహారంలో రాజ్​తరుణ్​కు నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18వ తేదీ లోగా తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. బీఎన్​ఎస్​ఎస్​ 45 కింద రాజ్​తరుణ్​కు నార్సింగి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

మాల్వీ వల్లే రాజ్​ తనను దూరం పెట్టాడని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. మాల్వీ ఆమె సోదరుడు తనను బెదిరించారని, అనవసరంగా డ్రగ్స్ కేసులో తనను ఇరికించారని ఆరోపించింది. మరోవైపు అసలు రాజ్​కు తనకు వృత్తిరీత్యా సంబంధమే తప్ప వ్యక్తిగతంగా సంబంధాలు లేవని మాల్వీ మల్హోత్రా పోలీసులకు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news