ఫ్యాన్స్​కు సారీ చెప్పిన నవీన్ పొలిశెట్టి.. ఎందుకో తెలుసా..?

-

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి ప్రస్తుతం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ సినిమా ప్రమోషన్స్​లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే తాజాగా హైదరాబాద్​లోని ఓ మాల్​లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ ప్రోగ్రామ్​లో నవీన్ పొలిశెట్టి తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఈ సినిమా చిత్రీకరణకు అధిక సమయం పట్టిందని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల వల్ల విడుదల ఆలస్యం అయిందని, ఆ తప్పు జరిగినందుకు తమను మన్నించాలని పొలిశెట్టి ప్రేక్షకులను కోరారు. ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా ఆలస్యమై వారిని నిరాశకు గురిచేసిందనే ఉద్దేశంతో ఆయన మాట్లాడారు.

దర్శకుడు పి. మహేశ్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో అనుష్క శెట్టి కథానాయిక. ఈ సినిమా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో స్టాండప్‌ కమెడియన్‌గా నవీన్‌, చెఫ్‌గా అనుష్క సందడి చేయనున్నారు. ‘జాతిరత్నాలు’ (2021) తర్వాత నవీన్‌, ‘నిశ్శబ్దం’ (2020) తర్వాత అనుష్క నటించిన చిత్రం ఇదేకావడంతో ఇరువురి అభిమానులు ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news