‘టిల్లూ స్క్వేర్‌’లో రాధిక గెస్ట్ రోల్.. ఇక థియేటర్లు దద్దరిల్లాల్సిందే

-

అసలు నన్ను నమ్మడానికి నీకెందుకు అంత ప్రాబ్లెం టిల్లు.. అంటూ డీజే టిల్లు సినిమాలో రాధిక.. అదేనండి నేహా శెట్టి అడుగుతుంటే థియేటర్లు ఎంత దద్దరిల్లాయో చూశాం కదా. ఇక ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ కూడా అంతా ఇంతా కాదు. అందుకే దీనికి సీక్వెల్​గా ఇప్పుడు టిల్లు స్క్వేర్ వస్తోంది. అయితే ఇందులో హీరోయిన్ మాత్రం రాధిక కాదు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్​గా నటిస్తోంది.

అయితే తాజాగా ఈ సినిమాలో నేహా శెట్టి గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఆమె రోల్ 3 నుంచి 4 నిమిషాల వరకు ఉండనుందట. సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం కానున్నట్లు సమాచారం. దీని గురించి ఈ చిత్రబృందం అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం.. నేహా శెట్టి ఎంట్రీతో థియేటర్లు మోతమోగడం ఖాయం. సితార బ్యానర్‌లో తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్‌ సినిమాకు కూడా సిద్ధూనే క‌థ‌ను అందిస్తున్నాడు.ఈ సీక్వెల్‌ చిత్రాన్ని కొత్త దర్శకుడు మల్లిక్‌రామ్‌ తెరకెక్కిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news