30 శాతం టీడీపీ నేతలు వైసీపీలోకి రాబోతున్నారు – కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి

-

30 శాతం టీడీపీ నేతలు వైసీపీలోకి రాబోతున్నారని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి షాకింగ్‌ కామెంట్స్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారని.. సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీలో పలువురు చేరుతున్నారని వెల్లడించారు. మమ్మల్ని నమ్మి పార్టీలో చేరిన వారికి పాత కొత్త తేడా లేకుండా అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని ప్రకటించారు.

ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలే మా గెలుపునకు శ్రీరామ రక్ష అన్నారు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. కోవూరు నియోజకవర్గంలో టిడిపి తుడిచిపెట్టుకుపోయిందని.. ఉన్న 30 శాతం కూడా మాతో టచ్ లో ఉన్నారని తెలిపారు. త్వరలోనే వాళ్లను కూడా పార్టీలో చేర్పించుకుంటామని… మళ్లీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి పట్టాభిషేకం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news