‘నిశ్శబ్దం’ ట్రైలర్ లో సైగలతో చంపేసిన స్వీటీ…!

-

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. తెలుగుతో పాటు తమిళ్౦లో కూడా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. భాగమతి సినిమా తర్వాత అనుష్క చేస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ కి కూడా మంచి స్పందన వచ్చింది. తెలుగులో మాత్రమే ‘నిశ్శబ్ధం’ అంటే టైటిల్ తో వస్తుంది.

మిగిలిన భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో వస్తుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయింది. ఈ ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. అనుష్క కచ్చితంగా హిట్ కొడుతుంది అంటున్నారు పలువురు. ఈ సినిమాలో స్వీటి సాక్షి అనే మూగ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తుంది. పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమా ఓ సైలెన్స్ థ్రిల్లర్‌ గా వస్తోంది ఈ చిత్రం. ట్రైలర్ లో సైగలతో అనుష్క విశేషంగా ఆకట్టుకుంది. తమిళ నటుడు మాధవన్, హాలీవుడ్ నటుడు మ్యాడ్‌సన్ ఈ సినిమాలో నటిస్తున్నారు.

అలాగే ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే కీలక పాత్ర చేస్తుంది. అంతే కాకుండా తమిళ స్టార్ హీరోయిన్ అంజలి, అవసరాల శ్రీనివాస్ వంటి వారు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ కి మంచి స్పందన వస్తుంది. ఈ సినిమాలో అనుష్క నట విశ్వరూపం చూపిస్తుంది అంటున్నారు పలువురు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news