ఆస్కార్ ప్రొడ్యూసర్​తో శ్రీకాంత్ తనయుడి సినిమా.. పాన్ ఇండియా లెవెల్​లో ప్లాన్

-

మలయాళ స్టార్​ హీరో మోహన్‌ లాల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా వృషభ. నంద కిశోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాను బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ నిర్మిస్తుండగా.. తాజాగా ఈ టీమ్​లోకి హాలీవుడ్​కు చెందిన నిక్ థర్లో చేరారు. ఆయన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్​గా వ్యవహరించనున్నారు.

అయితే నిక్.. ఆస్కార్ ప్రొడ్యూసర్. ఆయన ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా చేసిన ‘మూన్‌లైట్‌’ తదితర చిత్రాలకు ‘ఆస్కార్‌’ అవార్డులు కూడా దక్కడం విశేషం. తాను పనిచేస్తున్న తొలి ఇండియన్​ సినిమా వృషభ కావడం చాలా ఆనందంగా ఉందంటూ నిక్ పేర్కొన్నారు. ప్రతి సినిమా తనకు ఓ కొత్త అనుభూతి పంచుతుందని తెలిపారు.

ఇక ‘వృషభ’ సినిమా విషయానికి వస్తే.. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్​లో తెరకెక్కించేందుకు మేకర్స్​ ప్లాన్​ చేస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్​గా రూపొందుతున్న ఈ సినిమాలో మోహన్‌లాల్‌ తనయుడిగా రోషన్‌ కనిపించనున్నాడు. మరో కీలక పాత్రలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ కపూర్‌ కుమార్తె శనాయా కపూర్‌ నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news