పవన్ కళ్యాణ్ బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. స్పెషల్ గెస్ట్ ఎవరంటే..?

-

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రలో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో ఆయన ఇటీవల నటించిన చిత్రం బ్రో. జూలై 28వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, పాటలు అన్నీ కూడా మంచి కిక్కిస్తున్నాయి. ఇక తప్పకుండా ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులు కూడా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

పైగా రాజకీయాలలో ఉన్న పవన్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తారా? రారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ , వేదిక వివరాలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇకపోతే అసలు విషయంలోకి వెళితే.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర బృందం జూలై 25న శిల్పకళా వేదికగా ఏర్పాటు చేస్తున్నట్లు ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ స్పెషల్ గెస్ట్ గా హాజరవుతున్నట్లు సమాచారం.

అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. స్వయంగా పవన్ కళ్యాణ్ నటించిన సినిమాకి ఆయన గెస్ట్ గా రావడం ఏంటి? అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే గెస్ట్ రోల్ చేసినంత మాత్రాన ఈ సినిమా ఆయనది కాకుండా పోతుందా? అన్న ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ది ముందు నుంచి అతిధి పాత్ర మాత్రమే.. ఇప్పటివరకు వదిలిన ప్రమోషన్ కంటెంట్ లో సాయి ధరమ్ ని ఎక్కువగా ఫోకస్ చేశారు.ఒకవైపు పారితోషకం కోసమే పవన్ ఈ సినిమా చేశాడంటూ వార్తలు కూడా వచ్చాయి. ఏది ఏమైనా గెస్ట్ గా నటించాడు కాబట్టే ఆయన ఈ సినిమాకు స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news