ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఏం జ‌రిగిందంటే..?

-

బాలీవుడ్‌లో విజయవంతమైన పింక్ ఆధారంగా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ చిత్రం ద్వారా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల గ్యాప్ తీసుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేస్తున్న సినిమా కావ‌డంతో ఫ్యాన్స్ భారీ ఆశ‌లు పెట్టుకున్నారు. వేణు శ్రీరామ్ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ మ‌రియు ఫ‌స్ట్ సాంగ్‌ ఇటీవల రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వ‌చ్చింది. అంజలి, నివేత థామస్, ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రం కోసం పవన్ అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. అయితే ఫ్యాన్స్‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బిగ్ షాక్ ఇచ్చారు. వాస్త‌వానికి ఈ చిత్రం మే 15న రిలీజ్ చేద్దానుకున్నారు చిత్ర‌యూనిట్‌. కానీ ఈ డేట్ కన్నా ఇంకా నెల రోజుల పాలు ఈ సినిమా విడదల ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ నెలాఖరికి ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వాల‌న్న‌ది పవన్ కళ్యాణ్ ప్లాన్. కానీ ఏపీలో పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎన్నికలతో పవన్ బిజీ కానున్నాడు.

ఈ నేపథ్యంలో వకీల్ సాబ్‌ సినిమాకు కేటాయించిన డేట్స్‌ను అడ్డస్ట్ చేయనున్నాడట. అందుకే ఈ సినిమా నెల రోజులు ఆలస్యంగా విడుదలయ్యే అవకాశాలున్నాయి. త్వరలో ‘వకీల్ సాబ్’ సినిమాకు సంబంధించి కొత్త రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశాలున్నాయి. కాగా, ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేసిన బాలీవుడ్ నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్ తెలుగులో దిల్ రాజుతో కలిసి రీమేక్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news