గూడూరులో ఉద్రిక్తత..పవన్ కళ్యాణ్ బ్రో సినిమా ఫ్లెక్సీలు చించివేత !

-

గూడూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గూడూరులో K3K సంగం థియేటర్ దగ్గర గందరగోళం చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ బ్రో సినిమా ఫ్లెక్సీలు చించివేయడంతో చెలరేగింది వివాదం. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానులకు యాజమాన్యానికి మధ్య తలెత్తింది వివాదం. ఒక్కో ఫ్లెక్సీ కట్టెందుకు 2500/- డిమాండ్ చేసింది థియేటర్‌ యాజమాన్యం.

వైసీపీ నాయకుల ప్రోద్బలం తోనే యాజమాన్యం ఇలా వ్యవహరిస్తోందని జనసేన నాయకులు వాదన చేస్తున్నారు. యాజమాన్యం వచ్చి పవన్ కళ్యాణ్ ప్యాన్స్ కు క్షమాపణ చెపితే కానీ ప్రదర్శన జరగనీయబోమని హెచ్చరిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానుల దెబ్బకు దిగివచ్చింది థియేటర్ యాజమాన్యం. యధాతథంగా ఫ్లెక్సీల ఏర్పాటుతో ఈ వివాదం ముగిసింది. కాగా బ్రో సినిమా ఇవాళ రిలీజ్‌ అయి.. తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్‌ తెచ్చుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news