ఆ ఛాలెంజ్ స్వీకరించి.. పవన్ కి బర్త్ డే విషెస్ చెప్పిన పాయల్..!

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి మంచి స్పందనే వచ్చింది. ఇప్పటికే ఎంతో మంది సినీ తారలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు చాలా మంది ఈ ఛాలెంజ్‌ ను స్వీకరించారు. అయితే తాజాగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొంది అందాల ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. బాలానగర్ లోని తన నివాసంలో మొక్కలు నాటింది.

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మొక్కను నాటి అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది పాయల్ రాజ్‌పుత్. ఈ సందర్భంగా ప్రముఖ హీరోలు రవితేజ, సౌరబ్, కరణ్, హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పాయల్ పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్య‌క్ర‌మం చేప‌ట్టిన సంతోష్‌గారికి అభినంద‌న‌లు అని తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news