వామ్మో పూజ‌… ఇలా రేటు పెంచేసిందేంటి…

-

ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది పూజా హేగ్దే.. మొదట్లో సక్సెస్‌లు ఎక్కువుగా రాలేదు. దీంతో ఆమె బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్క‌డ స్టార్ హీరో హృతిక్‌రోష‌న్ స‌ర‌స‌న మొహంజోదారో సినిమాలో న‌టించింది. ఆ సినిమా కోసం ఆమె ఏకంగా యేడాదిన్న‌ర‌కు పైగా కాల్షీట్లు ఇచ్చింది. చివ‌ర‌కు స‌క్సెస్ ఆ సినిమా ప్లాప్ అవ్వ‌డంతో ఆమె తిరిగి టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది.

తాజాగా వచ్చిన మహేష్ బాబు మహర్షి, ఎన్టీఆర్ అరవింద సమేత, వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేశ్’ సినిమాలు పూజా కెరియర్ ని ఒక్కసారిగా మార్చేసాయి. ప్ర‌స్తుతం ఆమె టాలీవుడ్‌లో వ‌రుస‌గా టాప్ హీరోల స‌ర‌స‌న ఛాన్సులు ద‌క్కించుకుంటూ దూసుకుపోతోంది. పూజ రేంజ్ పెర‌గ‌డంతో ఇప్పుడు ఆమె త‌న రేటు కూడా పెంచేసింది. దీంతో టాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సైతం ఆమె రేటు చూసి షాక్ అవుతున్నారు.

ప్రభాస్ తో చేయబోయే సినిమాకి గాను పూజా రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.. సాహో త‌ర్వాత ప్ర‌భాస్ జిల్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ( వ‌ర్కింగ్ టైటిల్ జాన్‌) సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం పూజా అల్లు అర్జున్ , త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో నటిస్తుంది. ఆ తర్వాత అఖిల్ సినిమాలో సైతం ఆమె హీరోయిన్‌గా ఎంపికైన సంగ‌తి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news