బుట్ట బొమ్మ ఆఫర్లు మామూలుగా లేవుగా…!

-

నేటి తరం హీరోయిన్ లను అందరిని పక్కకు నెట్టి వరుస అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన్ పూజా హెగ్డే. ఒక లైలా కోసం సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగుపెట్టిన పూజా హెగ్డే తన కెరీర్ ను అద్భుతంగా మలచుకుంది అని చెప్పవచ్చు. తెలుగులో ఒకటి రెండు సినిమాల్లో చేసిన వెంటనే బాలీవుడ్ లో స్టార్ట్ హీరో అయిన హృతిక్ రోషన్ పక్కన మోహంజుదారో మూవీలో నటించే అవకాశం కొట్టేసింది పూజా హెగ్డే. అయితే ఈ సినిమా అనుకున్నంతగా ఫలితాన్ని ఇవ్వలేదు, కానీ పూజా ను మాత్రం ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ కి పరిచయం చేసింది.

తరువాత వరుస అవకాశాలతో తెలుగు సినిమాలలో బిజీ అయ్యింది పూజా హెగ్డే. దువ్వాడ జగన్నాథం సినిమా తరువాత వెనుదిరిగి చూసుకోలేదు పూజా. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించి మెప్పించారు. తరువాత వరుస జూనియర్ ఎన్టీఆర్ పక్కన అరవింద సమేత సినిమా, హీరో మహేష్ బాబు తో చేసిన సినిమా మహర్షి, వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దలకొండ గణేష్, ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసిన అల వైకుంఠ పురంలో సినిమాలలో నటించిన పూజా హెగ్డే కు ప్రేక్షకాదరణ లభించింది.

అయితే ఇప్పుడు పూజా హెగ్డే మరో మంచి ఆఫర్ సొంతం చేసుకుంది. అదేంటంటే తాజాగా అక్షయ్ కుమార్ నటిస్తోన్న ‘బచ్చన్ పాండే’ లో కృతి సనన్ ఒక హీరోయిన్‌గా మరో కథానాయికగా పూజా హెగ్డే ఎంపికైందట. ఈ సినిమా విషయానికొస్తే సౌత్‌లో సూపర్ హిట్ అయిన ఒక సినిమాకు రీమేక్ అని అంటున్నారు. అంతే కాకుండా సల్మాన్ ఖాన్ పక్కన ‘కభీ ఈద్ కభీ దివాళీ’ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే ను అనుకుంటున్నారట. ఈ మూవీ గనుక ఖరారు అయితే  దాదాపు రూ.3 కోట్ల నుంచి రూ4 కోట్ల రెమ్యునరేన్ ఉంటుందని సినీ ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్త.

ఇవే కాకుండా మరో బాలీవుడ్ చిత్రానికి ఓకే చెప్పిందని సినీ వర్గాల్లో టాక్. ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్ లో ప్రభాస్ 20వ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. అంతే కాకుండా అఖిల్ హీరోగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో కూడా పూజా నే హీరోయిన్. ఇవన్నీ తెలిసిన సినీ జనాలు పూజా హెగ్డే టైమ్ మామూలుగా లేదు, అవకాశాలు ఒకదాని వెంట మరొకటి దూసుకు వస్తున్నాయి అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news