Rashmika Mandanna: పూజా హెగ్డే వల్లే ‘తలపతి 66’లో రష్మిక మందనకు చాన్స్..క్లారిటీనిచ్చిన దిల్ రాజు

-

ప్రస్తుతం సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్స్ గా పూజా హెగ్డే , రష్మిక మందన దూసుకుపోతున్నారు. తెలుగు భాషలోనే కాదు ఇతర భాషల్లోనూ స్టార్ హీరోలతో చిత్రాలు చేస్తున్నారు. కాగా, ఇటీవల క్యూట్ బ్యూటీ రష్మిక మందన..వంశీపైడిపల్లి-ఇళయ దళపతి విజయ్ ‘తలపతి 66’లో హీరోయిన్‌గా ఫైనల్ అయింది. చెన్నైలో చిత్ర పూజా కార్యక్రమం కూడా జరిగింది. కాగా, ఈ అవకాశం పూజా హెగ్డే వల్లే వచ్చిందన్న వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది.

సోషల్ మీడియాలో ఈ విషయమై డిస్కషన్ కూడా జరుగుతోంది. ఇంతకీ నిజమేమిటంటే..పూజా హెగ్డే, విజయ్ జంటగా నటించిన ‘బీస్ట్’ ఫిల్మ్ ఈ నెల 13న విడుదల కానుంది. ఈ పిక్చర్ ను తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, హీరోయిన్ పూజా హెగ్డేను ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంటర్వ్యూ చేశారు. ఇందులో ‘తలపతి 66’ హీరోయిన్ సెలక్షన్ గురించి దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.

నిజానికి ‘తలపతి 66’లో పూజా హెగ్డేనే హీరోయిన్ అని దిల్ రాజు తెలిపారు. అయితే, బ్యాక్ టు బ్యాక్ ఒకే హీరోయిన్ అయితే బాగోదని, రష్మిక మందనను కన్సిడర్ చేసినట్లు దిల్ రాజు చెప్పారు. ఈ విషయమై తాను విజయ్‌తోనూ చర్చించినట్లు తెలిపారు.

పూజా హెగ్డే ను ఒకవేళ హీరోయిన్ గా సెలక్ట్ చేస్తే డేట్స్ విషయంలో క్లాష్ వచ్చే చాన్సెస్ ఉన్నాయని దిల్ రాజు తెలిపారు. అలా పూజా హెగ్డే ‘తలపతి 66’ మూవీకి నో చెప్పగా, అది రష్మిక మందనకు ప్లస్ అయింది. అయితే, పూజా హెగ్డే, రష్మిక మందన ఇద్దరూ స్టార్ హీరోయిన్స్ గా దూసుకుపోతుండటం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news