సిల్వర్ స్క్రీన్​పై మరోసారి మెరవనున్న ప్రభాస్-అనుష్క జోడీ..?

-

టాలీవుడ్​లో మోస్ట్ వాంటెడ్ పెయిర్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది ప్రభాస్-అనుష్క జోడీ. ఈ ఇద్దరూ కలిసి బిల్లా, మిర్చి, బాహుబలి సిరీస్​లలో నటించారు. ఈ నాలుగు సినిమాలు సూపర్ హిట్​గా నిలిచాయి. నిర్మాతలకు కాసులు పండించాయి. మరోవైపు ఈ సినిమాల్లో ప్రభాస్-స్వీటీల జోడీని చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే వీళ్లిద్దరూ కలిసి సినిమాలు చేసి చాలా ఏళ్లయింది. వీరిద్దరూ కలిసి ఎప్పుడు కనిపిస్తారా అని ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Prabhas and Anushka Shetty house-hunting in Los Angeles

అయితే ఈ జోడీకి సంబంధించి ఓ వార్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు మరోసారి ఈ జంట స్క్రీన్‌పై మెరవనుందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారడంతో ప్రభాస్, అనుష్కల అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఖుష్‌ అవుతున్నారు.

ఇక ప్రభాస్‌కు సంబంధించి మరో వార్త కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్టార్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ త్వరలోనే ప్రభాస్‌తో ఓ సినిమా ప్లాన్‌ చేశారట. భారీ బడ్జెట్‌ మూవీగా దీన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. మైత్రీమూవీస్‌ మేకర్స్‌పై ఇది రానుందని టాక్‌.

Read more RELATED
Recommended to you

Latest news