ప్రభాస్ సలార్ అదిరిపోయేలా,మరో లెవెల్లో..!!

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  బాహుబలి సినిమా తో వచ్చిన గ్యాప్ పూడ్చడం కోసం బాగా కష్టపడుతున్నాడు.  ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ తో కలిసి తొలి బాలీవుడ్ మూవీగా ‘ఆది పురుష్’లో నటిస్తున్న ప్రభాస్ ఈ మూవీ షూటింగ్ ని పూర్తి చేసాడు.

అలాగే ప్రస్తుతం తన దృష్టి అంతా రెండు ప్రాజెక్ట్ లపై పెట్టాడు. ‘కేజీఎఫ్’ సిరీస్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ‘సలార్’లో , మరియు ప్రోజెక్ట్ కె సినిమాలలో  నటిస్తున్న విషయం తెలిసిందే. సలార్ మూవీ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్‌ను దర్శకుడు ప్రశాంత్ నీల్ రంగంలోకి  దించారట.ఈ విలన్‌ పాత్ర పోషిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్  కూడా ఈ షూటింగ్ లో ఉన్నారు.

ఈ సందర్భంగా పృథ్వీరాజ్ సలార్ సినిమా పై కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వ ప్రతిభకు తాను మైమరచి పోయానని చెప్పుకొచ్చాడు. ఇందులోని యాక్షన్ ఎడిసోడ్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయని చెప్పాడు. ఆ సినిమా కోసం వేసిన సెట్స్ ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని, సినిమా పై అందరూ ఎన్ని అంచనాలు పెట్టుకున్నా అవి ఖచ్చితంగా రీచ్ అయ్యేలా ఉంటుందని అన్నారు. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందంకు హద్దులు లేకుండా పోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news