హనుమాన్ పార్ట్-2 షూటింగ్ షురూ.. హీరో ఎవరంటే?

-

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘హను-మాన్‌’ మూవీకి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం వంద కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్‌’  మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా షురూ అయింది. అయితే ఈ చిత్రాన్ని ఉద్దేశించి ప్రశాంత్‌ వర్మ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సీక్వెల్‌లో తేజ హీరో కాదని ఓ బడా హీరో నటించనున్నట్లు చెప్పారు.

‘హను-మాన్‌’ కంటే వందరెట్లు భారీ స్థాయిలో ‘జై హనుమాన్‌’ ఉండనుందని ప్రశాంత్ వర్మ తెలిపారు. సీక్వెల్‌లో తేజ సజ్జా హీరో కాదని.. సీక్వెల్‌లోనూ అతడు హనుమంతు పాత్రలో కనిపిస్తాడని.. కానీ, ఆ సినిమా హీరో ఆంజనేయ స్వామి అని అసలు సంగతి చెప్పుకొచ్చారు. ఆ పాత్రను స్టార్‌ హీరో చేస్తారని వెల్లడించారు. 2025లో ఇది విడుదల కానుందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version