ఆ ఎన్టీఆర్ మూవీ లాస్ తో ప్రొడక్షన్ ఆపేద్దామనుకున్నా.. అశ్విని దత్

-

అశ్విని దత్: ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత అశ్వినీ దత్ ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత అశ్విని దత్ సినిమాల నిర్మాణంలో కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగలడం అనేది సహజమని, మళ్లీ పుంజుకుని చిత్రాలు తీస్తుంటామని అన్నారు. కానీ ఒక సినిమా ఫ్లాప్ తో చాలా గట్టి దెబ్బ తగిలిందని ఇక సినిమాలు వదిలేసి వెళ్ళిపోదాం అనిపించింది అంటూ చెప్పుకొచ్చారు.

అశ్విని దత్
అశ్విని దత్

“ఏదైనా సినిమాలో నేను దెబ్బ తిన్నప్పుడు చిరంజీవి పిలిచి ‘కథ సిద్ధం చేసుకోండి. మనం సినిమా చేద్దాం’ అని అనేవారు. నాగార్జున కూడా అంతే. వేరే వాళ్ల సినిమా ఆపేసి మరి నాకోసం సినిమాలు చేసిన హీరోలు ఎందరో ఉన్నారు. అయితే నా కెరీర్‌లో బాగా నిరాశకు గురి చేసిన సినిమా ‘శక్తి’. ‘ఇక మనకి ఈ ఇండస్ట్రీ అనవసరం. సినిమాలు వదిలేసి వెళ్లిపోదాం’ అని అనిపించింది. నిర్మాణ వ్యయం కూడా బాగా ఎక్కువైంది. ఆ ఒక్క సినిమాలోనే రూ.32 కోట్లు పోయాయి. ఇది మామూలు విషయం కాదు. నేనూ అరవింద్‌ కలిసి ‘చూడాలని ఉంది’ సినిమాను హిందీలో నిర్మించాం. ఆ సినిమా వల్ల మా ఇద్దరికీ కలిపి సుమారు రూ.12కోట్ల మేర నష్టం వచ్చింది. అంటే చెరో రూ.6కోట్లు అనమాట. అయితే అప్పటికి మేం ఇద్దరం ఫామ్‌లో ఉన్నాం కాబట్టి మళ్లీ కోలుకోగలిగాము. కానీ ‘శక్తి’ మాత్రం నాకు చాలా షాకింగ్‌గా అనిపించింది. అందుకే నాలుగైదేళ్ల పాటు సినిమాలు తీయాలని నాకు అనిపించలేదు. సరిగ్గా అదే సమయానికి పిల్లలు వచ్చి సినిమా తీస్తామంటే ఒప్పుకొన్నా. మంచి సినిమాలు తీయడంతో వాళ్లను ప్రోత్సహిస్తూ వచ్చాను” అని అశ్వినీదత్‌ అన్నారు.

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇలియానా జంటగా నటించిన శక్తి సినిమా 2011లో విడుదలైన సంగతి తెలిసిందే మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నో 50 కోట్లకు పైగా బడ్జెట్ తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించారు ప్రపంచవ్యాప్తంగా 700 పైగా స్క్రీన్లపై రిలీజ్ అయిన ఈ సినిమా గోరపరాజయాన్ని చవిచూసింది.

Read more RELATED
Recommended to you

Latest news