నిర్మాత దిల్‌ రాజు ఇంట విషాదం

-

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దిల్ రాజు తండ్రి శ్యామ్​ సుందర్ రెడ్డి అనారోగ్య కారణాలతో సోమవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు ఇప్పుడు 86 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంగా బాధ పడుతున్న ఆయన ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. సోమవారం రాత్రి ఎనిమిది గంటలు దాటిన తర్వాత ఆయన కన్నుమూసినట్లు ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. దిల్​ రాజు తండ్రి మరణ వార్త విన్న సినీ ప్రముఖులు ఆయన ఇంటికి తరలి వెళ్తున్నారు. దిల్ రాజుకు ధైర్యం చెబుతూ శ్యామ్ సుందర్ రెడ్డి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు.

శ్యామ్‌ సుందర్‌రెడ్డి స్వస్థలం నిజామాబాద్‌ జిల్లాలోని నర్సింగ్‌పల్లి. ఆయనకు ముగ్గురు సంతానం. వీరిలో దిల్​ రాజుతో పాటు విజయ్ సింహారెడ్డి, నరసింహారెడ్డి ఉన్నారు. నిర్మాత దిల్‌ రాజు అసలు పేరు వెంకట రమణారెడ్డి. చిన్నతనం నుంచే ఆయన్ను కుటుంబ సభ్యులంతా రాజు అని పిలిచేవారు. స్వస్థలం నిజామాబాద్‌. పైచదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. సినీ పరిశ్రమలోకి వచ్చే ముందు దిల్‌ రాజు పలు వ్యాపారాలు చేసి.. ఆ తర్వాత సినీ డిస్ట్రిబ్యూటర్‌గా మారారు.

Read more RELATED
Recommended to you

Latest news