పవన్ కల్యాణ్ కోసం అటూ ఇటూ పరిగెడుతున్న ప్రొడ్యూసర్ !

-

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘పింక్’ సినిమాతో రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలిసినదే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు మరియు బోనీ కపూర్ ఇద్దరూ కలిసి సినిమాని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి నెలరోజులు కాకముందే పవన్ కళ్యాణ్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వినపడుతున్నాయి.

Related image

అయితే ఈ సినిమాని ఎ.ఎం.రత్నం నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఫిలింనగర్ లో టాక్. గతంలో పవన్ కళ్యాణ్ ఎ.ఎం.రత్నం నిర్మాణ భాగస్వామ్యంలో చేసిన ‘ఖుషి’ సినిమా పవన్ కెరీర్లోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచిపోయింది.

 

ఇటువంటి తరుణంలో పవన్ సినిమాలు చేస్తున్న సమయంలోనే ఎ.ఎం.రత్నం దగ్గర అడ్వాన్స్ తీసుకోవటంతో..పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో చేసే సినిమాని నిర్మించడానికి పవన్ కళ్యాణ్ తో చర్చలు జరపడానికి ఎ.ఎం.రత్నం ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో పవన్ కళ్యాణ్ ఒకానొక సమయం లో షూటింగ్ లో ఉండగా మరొక సమయంలో పాలిటిక్స్ లో ఉంటున్న తరుణంలో పవన్ కోసం అటు ఇటు ఎ.ఎం.రత్నం పరిగెడుతున్నట్లు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Latest news