రికార్డుల మోత‌మోగిస్తున్న `రాధేశ్యామ్‌`!

-

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ స్టార్‌డ‌మ్ స్థాయి ఎక్క‌డికో వెళ్లిపోయింది. బాలీవుడ్ హీరోల‌ని `బాహుబ‌లి`తో ఓవ‌ర్‌టేక్ చేసేశాడు. ఇప్ప‌డు ప్ర‌భాస్ అంటే టాలీవుడ్ స్టార్ కాదు ఆలిండియా స్టార్‌. అత‌ని నుంచి దేశ వ్యాప్తంగా వున్న అభిమానులు అదే స్థాయి చిత్రాల‌ని ఆశిస్తున్నారు. దీంతో ప్ర‌భాస్ కూడా త‌న పంథాను మార్చుకుని మారిన ఇమేజ్‌, మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు.

ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. `జిల్‌` ఫేమ్ రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శ‌‌క‌త్వంలో యువీ క్రియేష‌న్స్‌, టి. సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్నిఅత్యంత భారీగా నిర్మిస్తున్నారు. ఈ నెల 23న ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా మేక‌ర్స్ ఈ మూవీ మోష‌న్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు. బ్ర‌డ్జిపై క‌దులుతున్న రైలు నుంచి బ‌య‌టికి వ‌చ్చి ఇచ్చిన స్టిల్స్ నెవ్వ‌ర్ బిఫోర్ ఎవ్వ‌ర్ ఆప్ట‌ర్ అనే స్థాయిలో వుంది. బ‌హుషా `టైటానిక్‌` సిగ్నేచ‌ర్ స్టిల్ స్ఫూర్తితో ఈ ఫీట్‌కి `రాధేశ్యామ్‌` టీమ్ పూనుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ 24 గంట‌ల్లోనే 15మిలియ‌న్ ప్ల‌స్ వ్యూస్‌ని రాబ‌ట్టి రికార్డు సృష్టించింది. తాజాగా సోమ‌వారం వ‌ర‌కు 25 మిలియ‌న్ క్యుమిలేటీవ్ వ్యూస్‌ని దాటి స‌రికొత్త రికార్డుని నెల‌కొల్ప‌డంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. చిన్న మోష‌న్ పోస్ట‌రే ఈ రేంజ్‌లో ఆక‌ట్టుకుంటే సినిమా ఏ రేంజ్‌లో సంచ‌ల‌నాలు సృష్టిస్తుదో.. ఏ స్థాయిలో బాక్సాఫీస్‌ని కొల్ల‌గొడుతుందో అని అంతా ఆరాతీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news