‘ఆర్ఆర్ఆర్’ సెట్స్ పై గణతంత్ర దినోత్సవ వేడుకలు.. గుర్రుగా ఉన్న‌ ఫ్యాన్స్‌..

-

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యంత భారీ క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే రిపబ్లిక్ డే సందర్భంగా తమ చిత్రం షూటింగ్ కంటే ముందు సెట్స్ పై రాజమౌళి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. అయితే, అభిమానుల మాత్రం రాజమౌళిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సెట్స్ పై జరిగిన రిపబ్లిక్ డే వేడుకలో ఎక్కడా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కనిపించలేదు. ఫొటోల్లో తమ అభిమాన తారలు కనిపించకపోవడంతో ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news