రజినీకాంత్ ‘దర్బార్’ రిలీజ్ కు బ్రేకులు….మ్యాటర్ ఏంటంటే…??

-

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా మాస్, కమర్షియల్ సినిమాల దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా దర్బార్. ముంబై మాఫియా నేపథ్యంలో భారీ యాక్షన్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజినీకాంత్, ఆదిత్య అరుణాచలం అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నివేత థామస్ ఒక కీలక పాత్రలో నటిస్తోంది.

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తుండగా, లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై ప్రేక్షకుల్లో, రజిని ఫ్యాన్స్ లో మంచి అంచనాలు ఏర్పరిచాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9 న పలు భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా రిలీజ్ కు బ్రేకులు పడ్డట్లు కోలీవుడ్ వర్గాల టాక్. గతంలో రజిని నటించిన 2.0 సినిమా సమయంలో లైకా ప్రొడక్షన్ సంస్థ వారు తమ వద్ద రూ.12 కోట్లు ఫైనాన్స్ తీసుకుని ఇప్పటివరకు కట్టలేదని, అది వడ్డీతో కలిపి మొత్తం ప్రస్తుతం రూ.23 కోట్లు అయిందని, మలేషియాకు చెందిన డిఎంవై క్రియేషన్స్ అనే సంస్థ కోర్ట్ ని ఆశ్రయించింది.

కావున తమ అప్పు తిరిగి చెల్లించేవరకు దర్బార్ రిలీజ్ ని ఆపేయాలని కోర్టు లో వారు కేసు వేయడం జరిగింది. అయితే అదంతా బూటకమని, ఆ కేసు కోర్ట్ లో నిలబడేది లేదని లైకా ప్రొడక్షన్స్ వారు అంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో దర్బార్ సినిమా అనుకున్న సమయానికే రిలీజ్ అవుతుందా లేదా అనేది ప్రస్తూతం కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ మ్యాటర్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది….!!

Read more RELATED
Recommended to you

Latest news