మ‌ళ్లీ హిమాలయాల బాట ప‌ట్టిన‌ రజనీకాంత్..

-

రజనీకాంత్‌ మరోసారి హిమాలయాల బాట పట్టారు. రజనీ నటిస్తున్న చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసిన తరువాత హిమాలయాలకు వెళ్లడం రజనీకాంత్‌కు ఆనవాయితీగా మారింది. హిమాలయాల్లో కనీసం 10 రోజులకు తగ్గకుండా ఆయన గడిపి తిరిగొస్తారు. తరువాత కొత్త చిత్రానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఈ క్ర‌మంలోనే తాజాగా ఆయన నటిస్తున్న ‘దర్బార్’కు గుమ్మడికాయ కొట్టేశారు. షూటింగ్ పూర్తి కాగానే ఆయన ఉత్తరాఖండ్ కు వెళ్లిపోయారు.

చెన్నై నుంచి ఆయన డెహ్రాడూన్ కు విమానంలో బయలుదేరారు. అక్కడి నుంచి కారులో పర్యటిస్తూ కేదార్ నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్య క్షేత్రాలను రజనీకాంత్ సందర్శించనున్నారు. ఆపై తాను ప్రత్యక్ష దైవంగా భావించే బాబా గుహకు వెళ్లి ధ్యానం చేసి, తిరిగి చెన్నై చేరుకుంటారని తెలుస్తోంది. ఆ తరువాతే ‘దర్బార్’ డబ్బింగ్, ప్రమోషనల్ కార్యక్రమాల్లో రజనీ పాల్గొంటారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news