RAKSHASUDU : ‘రాక్షసుడు’ సీక్వెల్ కి రంగం సిద్ధం .. పోస్టర్ రిలీజ్

-

టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన సైకలాజికల్ త్రిల్లర్ ”రాక్షసుడు” మూవీ బంపర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ రాక్షసుడు సినిమా కు… రమేష్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో… తాజాగా దీనికి సంబంధించిన సీక్వెల్ ప్లాన్ చేశాడు డైరెక్టర్ రమేష్ వర్మ. ఈ మేరకు టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసి… టాలీవుడ్ ప్రేక్షకులను కనువిందు చేశాడు.

రాక్షసుడు సినిమాకు కొనసాగింపుగా… రాక్షసుడు 2 రాబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు రమేష్ వర్మ. ఈ మూవీ… హోల్డ్ యువర్ బ్రీత్ అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. ఇక టైటిల్ పోస్టర్ విషయానికి వస్తే… ఓ సైకో చేతిలో గొడ్డలి పట్టుకుని శవాన్ని మోసుకు పోతున్నాడు. తన వెనకాల చైన్ కు రక్తంతో తడిసిన పదునైన కత్తి వేలాడుతు ఉంటడం మనకు కనిపిస్తుంది. ఇలా భయానకంగా ఉన్న ఈ పోస్టర్.. అందరినీ అలరిస్తోంది. అయితే రాక్షసుడు 2 నటి నటులను ఇంకా ప్రకటించలేదు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news