ఆ విషయంలోనూ పట్టువిడుపులు.. అదే నేను చేసిన తప్పు..!!

-

అదే నేను చేసిన తప్పని రకుల్ ప్రతీ సింగ్ తెగ బాధపడిపోతోందట. తెలుగులో తన గ్రాఫ్ చూసుకుంటే.. అమాంతం పెరిగి.. ఒక్కసారిగా పడిపోయినట్టు కనిపిస్తుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అమ్మడికి అవకాశాలు భారీగా వచ్చాయి. ఒకానొక స్థాయిలో స్టార్ హీరోయిన్‌గా క్షణం తీరిక లేకుండా గడిపింది.

 

మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ టాప్ స్టార్లతో చేసే అవకాశాలను అందుకుంది. అనతి కాలంలో ఇలా స్టార్లతో జత కట్టిన హీరోయిన్ ఎవ్వరూ లేరు. అంతగా పాపులర్ అయిన రకుల్‌కు ప్రస్తుతం అవకాశాలు మొహం చాటేశాయి. ప్రస్తుతం రకుల్ కెరీర్ గ్రాఫ్ డౌన్‌లో ఉంది. నిత్యం జిమ్‌లో గడుపుతూ.. బక్క చిక్కిపోతోంది రకుల్.

తాజాగా తన సినీ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రకుల్. తాను వరుసగా అందాలారబోతకే ప్రాధాన్యతనిచ్చానని, అది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు అర్థమైందని చెప్పుకొచ్చింది. తాను ఏ దర్శక, నిర్మాతకు సమస్యలు తెచ్చి పెట్టలేదని, పారితోషికం విషయంలో కూడా పట్టు విడుపు పాటించానని చెప్పింది. అయినా అవకాశాలు తగ్గిపోయాయంటే అందుకు కారణం తాను గ్లామరస్‌గా నటించడమేనని పేర్కొంది. నటనకు ప్రాధాన్యత కలిగిన పాత్రలను ఎంపిక చేసుకోకుండా కేవలం గ్లామర్‌కే పరిమితం అయ్యానని, ఫలితంగా అవకాశాలు దూరం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news