మాజీ మంత్రి సోమిరెడ్డి పై కాకాని గోవర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

మాజీ మంత్రి సోమిరెడ్డి పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోమిరెడ్డి సిగ్గులేకుండా అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఎన్నికల అధికారి పెట్టిన కేసులో నా పేరు ఉందని సోమిరెడ్డి నిరూపించగలరా..? అని ప్రశ్నించారు. గవర్నర్ పాలనలో కేసులు నమోదు చేశారా ? లేక టీడీపీ అధికారంలోకి వచ్చాక కేసు నమోదు అయిందా..? అని ప్రశ్నించారు.

మద్యం దొరికిన రైస్ మిల్ ఓనర్ కి, నాకు సంబంధం ఉందని నిరూపిస్తావా..? అని ప్రశ్నించారు. ఓటమిని ముందుగానే అంగీకరించిన సోమిరెడ్డి నోటికొచ్చినట్టు అబద్దాలు చెబుతున్నాడని పేర్కొన్నారు. పొదలకూరులో జరిగిన చంద్రబాబు సభకు 5వేల మంది వచ్చారని నిరూపిస్తే.. నా నామినేషన్ విత్ డ్రా చేసుకుంటానని పేర్కొన్నారు. సోమిరెడ్డి బతుకు అంతా అవినీతిమయమని.. ఓటర్లకు డబ్బులు పంచుతున్న సోమిరెడ్డిని డీస్ క్వాలిఫై చేయమని ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news