పిఠాపురానికి కడప రౌడీలు, గుండాలు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పలువురి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.  ముఖ్యంగా అధికార వైసీపీ నేతలకు.. కూటమికి చెందిన పలువురు నేతలకు పచ్చ గడ్డి వేస్తే.. భగ్గుమన్న చందంగా మాటలు తూటాల్లో పేలుతున్నాయి. తాజాగా జనసేన నేత నాగబాబు వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఓడించేందుకు.. కడప నుంచి గుండాలు, రౌడీలను తీసుకొస్తున్నారని ఆరోపించారు.

ఈ కుట్ర వెనక వైసీపీ నేతలు మిథున్ రెడ్డి దాడిశెట్టి రాజా రెడ్డి ఉన్నారని ఆరోపించారు. వారిరువురూ కలిసి పవన్ కళ్యాణ్ను ఓడించేందుకు పన్నాగాలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎవరు ఏం చేసినా.. ఎంతమందిని తీసుకొచ్చిన పవన్ ను ఓడించడం అసాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంతమందిని తీసుకువచ్చినా.. తాము బెదిరేది లేదని స్పష్టం చేశారు. ఎంతమంది వస్తారో రండి.. చూసుకుందాం.. అని ఆయన వైసీపీ నేతలను హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news