Ram Charan: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్‌చరణ్‌ దంపతులు

-

ఇవాళ తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రామ్ చరణ్ దంపతులు. శ్రీవారి సుప్రభాత సేవలో కుమార్తె క్లిమ్ కార తో కలిసి రాంచరణ్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకులు మండపంలో రామ్ చరణ్ దంపతులకు పండితులు ఆశీర్వాదం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ram charan upasana visits tirumala venkateswara swamy with daughter klin kaara arj

మొదటిసారిగా క్లిమ్ కారా తో కలిసి రావడంతో ఆలయం బయట రామ్ చరణ్ మరియు ఉపాసనని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. కాగా ఇవాళ రామ్ చరణ్ బర్త్ డే అన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే మంగళవారం రాత్రి తిరుమల శ్రీవారి దర్శనం కోసం రామ్ చరణ్ దంపతులు తిరుమల ఫినిక్స్ అతిధి గృహానికి చేరుకున్నారు. ఇవాళ శ్రీవారిని దర్శించుకున్నారు రాంచరణ్ దంపతులు. దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news